వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హతమైన ప్రాంతానికి అత్యంత సమీపంలో మరో మహిళ కూడా సజీవ దహనమైపోయింది. ఈ ఘటన శంషాబాద్ పరిధిలోని సిద్దులగుట్ట దేవాలయం సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో గుర్తు తెలియని మహిళ పెట్రోల్ మంటల్లో సజీవ దహనం అయ్యింది. ఈ ఘటనలోనూ నిందితులెవరన్న విషయం తెలియరాలేదు గానీ ప్రియాంకా రెడ్డి ఘటనలో మాదిరే పెట్రోల్ పోసి తగులబెట్టడానికి ముందే బాధిత మహిళపై అత్యాచారం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రియాంకా రెడ్డి ఘటన దర్యాప్తు, నిందితుల పట్టివేత, సీన్ ఆఫ్ అఫెన్స్ ను నిగ్గు తేల్చడంలో బిజీబిజీగా గడిపి, నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన వెంటనే అదే తరహాలో మరో మహిళ దారుణ హత్యకు గురైనట్లుగా సమాచారం రావడంతో సైబరాబాద్ పోలీసులు షాక్ కు గురయ్యారు. అంతేకాకుండా సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిపోయిన పోలీసులు సిద్దులగుట్ట ఆలయం వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
The post మహిళలకు రక్షణ లేదా ? appeared first on Telugu Bullet.
(TEL BULLET)