ఇప్పటికే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా, భారత్ సెమీస్ చేరగా న్యూజిలాండ్పై గెలిచిన ఇంగ్లాండ్ కూడా నాకౌట్ దశకు చేరింది. ఇక సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు పోటీ పడుతున్నాయి. కివీస్ ఖాతాలో 9 మ్యాచ్ల్లో ఐదు విజయాలతో 11 పాయింట్లు ఉండగా పాకిస్థాన్ తన చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. బంగ్లాపై గెలిస్తే పాక్ ఖాతాలోనూ 11 పాయింట్లు చేరతాయి. కానీ నెట్ రన్రేట్ పరంగా న్యూజిలాండ్ ఎంతో మెరుగ్గా ఉండటం పాకిస్థాన్కు మైనస్ కానుంది. రేపు బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో పాకిస్థాన్ భారీ విజయం సాధిస్తే సెమీస్ చేరే అవకాశం ఉంది. ఎంత భారీ విజయం అంటే పాక్ 350 పరుగులు చేస్తే అది కూడా బంగ్లాను 311 రన్స్ తేడాతో ఓడించాలి. 400 పరుగులు చేస్తే 316 రన్స్ తేడాతో, 450 పరుగులు చేస్తే 321 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించాలి. క్రికెట్ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో పాక్ విజయం సాధించాలి. కానే ఒకవేళ బంగ్లాదేశ్ గనుక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటే పాక్ సెమీస్ ఆశలు గల్లంతే. ఒక్క బంతి కూడా పడకుండానే పాకిస్థాన్ సెమీస్ రేస్ నుంచి నిష్క్రమిస్తుందనే చెప్పాలి. అంటే పాకిస్థాన్ సెమీస్ చేరొద్దంటే బంగ్లాదేశ్ తీవ్రంగా పోరాడాల్సిన అవసరం లేదు జస్ట్ టాస్ గెలిస్తే చాలన్న మాట. పాక్పై ప్రతీకారం తీర్చుకునే సువర్ణావకాశం బంగ్లాదేశ్ ముందుంది. ఒక వేళ ఆ మ్యాచ్లో బంగ్లాదేశ్పై పాకిస్థాన్ గెలిచినా అది కంటి తుడుపు మాత్రమే కానుంది.
The post పాక్ సెమీస్ కి వద్దంటే…బంగ్లా టాస్ గెలిస్తే చాలు appeared first on Telugu Bullet
(TEL BULLET)