బైంసాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యలతో తల్లీ కూతురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల ప్రకారం.. భాగ్యశ్రీ (40) అనే మహిళ 12 ఏళ్ల క్రితం భర్తతో విడిపోయి పార్లర్ నడుపుతూ జీవనం నెట్టుకొస్తుంది. కూతురు సిన్ని (22)ని డాక్టర్ చేయాలనుకుంది.
ఈ నేపథ్యంలో కూతురు చదువు కోసం అప్పులు చేసి మెడిసిన్ చదివిస్తుంది. అయితే ఆర్థిక భారం అధికమవ్వడంతో తల్లీ, కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.
The post ఉరివేసుకొని తల్లీ కూతురు ఆత్మహత్య appeared first on Telugu Bullet.
(TEL BULLET)